కరెంటు సమస్యలపై ఆరా తీసిన ADE
SRD: మనూర్ మండలం పుల్కుర్తికి ఖేడ్ ADE నాగిరెడ్డి సందర్శించారు. గ్రామ వాసులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఊరడమ్మ మందిరం ఎదురుగా ప్రమాదకర స్తంభాలకు తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కరెంటు సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో యువ నాయకుడు పోతుల మైపాల్ రెడ్డి పాల్గొన్నారు.