సేంద్రియ ఉత్పత్తుల ఇమేజ్ పెంచాలి: కలెక్టర్
ELR: జిల్లాలో సేంద్రియ విధానంలో సాగుచేసిన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజ్ పెంచి ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం సేంద్రిక వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయాలపై సమీక్షించారు. వినియోగదారులకు నేరుగా రైతులు తమ ఉత్పత్తులు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.