25న తొలిసారిగా పుంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు
CTR: పుంగనూరులో తొలిసారిగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నటరాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాదేశాల మేరకు రాబోవు విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ అడ్మీషన్ల కోసం ఈనెల 25న పుంగనూరులో బసవరాజ ప్రభుత్వ హైస్కూల్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.