జంపాపురంలో సుంకలమ్మ అవ్వ దేవర ఉత్సవాలు

జంపాపురంలో సుంకలమ్మ అవ్వ దేవర ఉత్సవాలు

KRNL: కోసిగి మండల పరిధిలోని జంపాపురం గ్రామంలో శ్రీ సుంకలమ్మ అవ్వ దేవర ఉత్సవాలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి నైవేద్యం, అకుపూజ, కుంకుమార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. సుంకులమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వైసీపీ జిల్లా కార్యదర్శి పీ. మురళీ మోహన్ రెడ్డి, ఎంపీపీ ఈరన్న, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.