52 మందిని కత్తులతో నరికి చంపారు

52 మందిని కత్తులతో నరికి చంపారు

కాంగోలోని తూర్పు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు దారుణానికి ఒడిగట్టారు. కాంగో దళాల చేతిలో చావుదెబ్బ తిన్న కోపంతో, అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌ తిరుగుబాటుదారులు బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై అమానుషంగా దాడి చేశారు. ఈ ఊచకోతలో 52 మందిని కత్తులతో నరికి చంపారు. తిరుగుబాటుదారుల ఈ అమానుష చర్యపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు.