VIDEO: పలమనేరు శివాలయంలో YCP నాయకుడి ప్రమాణం
CTR: పలమనేరులో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వైసీపీ పట్టణ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి తన ఇంటికి ఉచితంగా ఇసుక తోలించుకున్నాడని టీడీపీ నేతలు సోమవారం ఆరోపించారు. దీంతో హేమంత్ కుమార్ రెడ్డి శివాలయంలో మంగళవారం చన్నీటి స్నానం చేసి తన ఇంటికి ఉచితంగా ఇసుక తోలుకోలేదని ప్రమాణం చేశారు.