'రైతులు పండించిన పత్తిని జిన్నింగ్ మిల్లులో వెంటనే కొనాలి'

KMR: రైతులు పండించిన పత్తి పంటను జిన్నింగ్ మిల్లులో వెంటనే కొనుగోలు చేయాలనీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో సీసీఐ కృష్ణ నేచురల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ సందర్శించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తిని తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు.