ఫిర్యాదులపై విచారణ చేసి న్యాయం చేస్తాం: ఎస్పీ

KRNL: కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' నిర్వహించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 98 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.