VIDEO: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: MLA
ADB: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో నిర్వహించిన BRS వర్క్ షాప్లో అనిల్ జాదవ్ పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు, రైతు భరోసా పెట్టుబడి సాయం, మహిళలకు ప్రతినెల రూ. 2500 చెల్లింపు వంటి అనేక పథకాలను ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే తెలిపారు.