ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: కోవూరు పట్టణం శాంతినగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు చేసి 24 గంటల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.