డ్రగ్స్.. ఇద్దరు మైనర్లు అరెస్ట్
AP: కృష్ణా జిల్లా పెనమలూరులో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి మొత్తం 4 కిలోల గంజాయితో పాటు ఒక గ్రాము ఎండీఎమ్ఏ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ఈ ఇద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.