మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఏఐ రోజురోజుకూ మరింత స్మార్ట్గా మారుతోంది. ఇప్పటికే మనుషులు చేసే చాలా పనులను ఏఐ చేయడం ప్రారంభించింది. అయితే, వాటిని కూడా మనిషిలా సొంతంగా ఆలోచించే తెలివితేటలు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రాజెక్టులపై మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి ప్రాజెక్టులను ఆపేయాలని సూచించారు. ఈ విషయంలో ఏఐ ఎప్పుడూ మనిషిని చేరుకోలేదని పేర్కొన్నారు.