'డయేరియాపై ఆందోళన చెందవద్దు'
SKLM: డయేరియాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె. పద్మావతి అన్నారు. శనివారం సాయంత్రం డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అతిసారం తగ్గుముఖం పట్టిందని, ప్రతీ ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.