'సార్వజనిక సేవలు సౌకర్యవంతంగా అందించటమే లక్ష్యం'

'సార్వజనిక సేవలు సౌకర్యవంతంగా అందించటమే లక్ష్యం'

VZM: ప్రజలకు సార్వజనిక సేవలను మరింత సౌకర్యవంతంగా అందించే లక్ష్యంతో మదర్‌ ఫీడింగ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను హెడ్ పోస్టాఫీలో పోస్టుమాష్టర్ జనరల్ వియస్ జయశంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... ఈ కొత్త సౌకర్యాలు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడంలో సహాయ పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కే. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.