భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు భీమేశ్వరుడిని దర్శించుకుని అభిషేకం, అన్నపూజ, కళ్యాణం, తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకుంటున్నారు.