టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ బుకింగ్‌లో మార్పులు

టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ బుకింగ్‌లో మార్పులు

TPT: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యార్థం కొత్త విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళం (రూ.10,000), బ్రేక్ దర్శనం టిక్కెట్ (రూ.500) మొత్తాన్ని కలిపి రూ. 10,500ను ఒకేసారి ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కల్పించింది.