ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

VZM: గంట్యాడ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్ర భవనాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో తాగునీరు విద్యుత్తు టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం పలు సూచనలు ఇచ్చారు. గంట్యాడ తహసిల్దార్ నీలకంటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.