పోలీసు చట్టాలపై ప్రజలకు అవగాహన
VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో డెంకాడ ఎస్సై ఏ. సన్యాసినాయుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముఖ్య కూడళ్లలో భారీ ఫ్లెక్సీలను ఆదివారం ఏర్పాటు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని వీటి ద్వారా సూచించారు.