'సీఎం పర్యటనను విజయవంతం చేయాలి'

'సీఎం పర్యటనను విజయవంతం చేయాలి'

VZM: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ సేధు మాధవన్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమ స్థలం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.