విద్యుత్ షాక్తో యువకుడికి గాయాలు

NZB: పొతంగల్ మండలం సుంకినికి చెందిన అభిషేక్ విద్యుత్ షాక్కు గురై నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పశువులను మేపడానికి వెళ్లిన అతనికి తెగిపడిన విద్యుత్ తీగ తగిలింది. దీంతో మెడ, భుజం, చేయి భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.