ఘనంగా అప్పన్న స్వామి నిత్య కళ్యాణం

ఘనంగా అప్పన్న స్వామి నిత్య కళ్యాణం

VSP: విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని అప్పన స్వామికి సోమవారం నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సుప్రభాత వేళ స్వామి వారిని మేల్కొలిపి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వందలాది మంది భక్తులు తరలిరాగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.