ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం: ఛైర్పర్సన్

ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం: ఛైర్పర్సన్

VKB: తాండూరు పట్టణ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాలరాజు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.