ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

ATP: ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు శనివారం ఉదయం లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసిందని తెలిపారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం కోసమే ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.