ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయం కల్పించాలి: కలెక్టర్
SS: జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టంపై జిల్లా మానిటరింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో బాధితులకు తక్షణ రక్షణ, దోషులకు కఠిన శిక్ష, బాధితుల పునరావాసం, న్యాయం త్వరితగతిన జరిగేలా చూడమని, పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.