వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెడనలోని 8వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ఇంఛార్జ్ ఉప్పాల రాము మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.