గిరిజన సమస్యలపై కమిషన్ ఛైర్మన్‌కు వినతి

గిరిజన సమస్యలపై కమిషన్ ఛైర్మన్‌కు వినతి

NLR: గిరిజన సామాజిక వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నెల్లూరు పర్యటన సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గిరిజనుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే కలిసి గిరిజన సమస్యలపై ప్రత్యేక మెమొరాండం సమర్పించారు.