రేపు యధావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

రేపు యధావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరుగుతుందని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.