పాల శీతలీకరణ కేంద్రానికి తాళం వేసి పాడి రైతుల నిరసన

పాల శీతలీకరణ కేంద్రానికి తాళం వేసి పాడి రైతుల నిరసన

BHNG: పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని కోరుతూ రాజాపేట మండలంలోని సింగారం గ్రామ పాడి రైతులు శనివారం రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్ర గేట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలల పాల బిల్లు పెండింగ్‌లో ఉందని, బిల్లుల చెల్లింపులో మదర్ డైయిరీ జాప్యం చేస్తుందని ఆరోపించారు.