పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

ప్రకాశం: పామూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాలను ఎస్సై అనూక్ మంగళవారం పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.