వాటర్ ట్యాంక్ను పరిశీలించిన కలెక్టర్
KDP: నగర పరిధిలోని అలంఖాన్ పల్లెలో ఉన్న మంచినీటి సరఫరా చేసే వాటర్ ట్యాంక్ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శనివారం పరిశీలించారు. ఇంతకుముందు కడప నగరానికి రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా చేయబడేది. నగరవాసుల మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రతి రోజు మున్సిపల్ వాటర్ సరఫరా చేయడం జరుగుతోందని కలెక్టర్ చెప్పుకొచ్చారు.