నెహ్రూపై రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు
బాబ్రీ మసీదును తిరిగి నిర్మించేందుకు ప్రజా ధనాన్ని ఉపయోగించాలని మాజీ ప్రధాని నెహ్రూ అనుకున్నారని కేంద్రమంత్రి రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర మాజీమంత్రి సర్దార్ పటేల్ ఆపారని వెల్లడించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంపై నెహ్రూ ప్రశ్నను లెవనెత్తగా.. ఆలయాన్ని ప్రజల విరాళాలతో కట్టారని, ప్రభుత్వ డబ్బు ఉపయోగించలేదని పటేల్ చెప్పారన్నారు.