స్వర్ణకవసారము కృత దుర్గాదేవిగా శ్రీ కనకమహాలక్ష్మి తల్లి
VZM: చీపురుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో మొదటి రోజు స్వర్ణకవసారము కృత దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు తల్లికి అలంకరణ చేపట్టి వైభవంగా పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల అన్ని రోజులు సామూహిక కుంకుమార్చనలు ఉంటాయని భక్తులు పాల్గొవచ్చని కమిటీ సభ్యులు తెలిపారు.