స్వామివారి సేవలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శేష వస్త్రంతో సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు పాల్గొన్నారు.