మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయ ఆదాయం

మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయ ఆదాయం

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామివారి ఆదివారం ఆదాయం రూ.1,87,514లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.78,520లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ.29,730లు ఆదాయం లభించిందన్నారు. అన్నదానానికి విరాళాల ద్వారా రూ.41,232లు, స్వామివారికి ఇతరుల ద్వారా రూ.38,032 లు ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.