1,592 స్కూళ్లలో బాలికలకు కరాటే శిక్షణ

1,592 స్కూళ్లలో బాలికలకు కరాటే శిక్షణ

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలికలు తమను తాము రక్షించుకునేలా రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం చేపట్టాలని, 1,592 పాఠశాలల్లో కరాటే నేర్పించనున్నారు. 6 నుంచి ఇంటర్ వరకు బాలికలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో కరాటేపై 2 నెలలపాటు 20 తరగతులను నిర్వహిస్తారు. ప్రతి తరగతి 90 నిమిషాల పాటు ఉంటుందని సమగ్ర శిక్షా అభియాన్ తెలిపింది.