VIDEO: జోగాపూర్ పంపు హౌస్కు చేరుకున్న ఎల్లంపల్లి జలాలు
SRCL: చందుర్తి మండలం జోగాపూర్ పంప్ హౌస్కు కొద్దిసేపటి క్రితం ఎల్లంపల్లి జలాలు చేరుకున్నాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో వారం రోజుల ముందుగానే నీరు చేరుకున్నాయి. దీంతో కాలువలు జలకళ సంతరించుకున్నాయి. వేసవికాలం ప్రారంభంలోనే నీరు రావడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.