'అంబేద్కర్ జయంతి శాంతియుతంగా జరుపుకోవాలి'

'అంబేద్కర్ జయంతి శాంతియుతంగా జరుపుకోవాలి'

కోనసీమ: ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతిని శాంతియుతంగా జరుపుకోవాలని రావులపాలెం సీఐ శేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావులపాలెంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం సాయంత్రం తహసీల్దార్ ముక్తీశ్వరరావు అధ్యక్షతన అంబేద్కర్ జయంతి కమిటీ సభ్యులతో రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించారు. జయంతి సజావుగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.