విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత

NZB: రుద్రూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులకు శుక్రవారం కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను అందచేశారు. హైస్కూల్లో ఇద్దరికీ, కేజీవీబీ విద్యార్థులు ముగ్గురికి డాక్టర్ అంబేద్కర్ విద్య జ్యోతి స్కాలర్షిప్ను అందచేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.