కొడంగల్లో పర్యటిస్తున్న సీఎం
VKB: కొడంగల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జగా అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే మరి కాసేపట్లో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.