రేపు జడ్పీ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక "మీ కోసం' నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.