VIDEO: అప్పుల భారంతో రైతు ఆత్మహత్య
KRNL: ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బీజీ అశోక్ (28) అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడంతో రూ. 9.5 లక్షల అప్పు చేసి పంటలు పండిస్తే సరిగ్గా పండకపోవడంతో నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మృతుడికి భార్య రాధ, ఉషశ్రీ(3), సాన్విక(01) కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు.