అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రాణించింది. ఏకంగా రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా, గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.18,331 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికానికి SBI మొత్తం ఆదాయం రూ.1,29,141 కోట్ల నుంచి రూ.1,34,979 కోట్లకు పెరిగింది.