ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తన కార్యాలయంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు , సాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.