కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలి

NZB: కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాక్లూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ హమాలీల కొరతను వెంటనే తీర్చాలని.. ధాన్యాన్ని వెనువెంటనే తూకాలు వేసి రైస్ మిల్లులకు పంపాలని ఆదేశించారు.