VIDEO: 'హామీలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి'
HYD: దిల్ సుఖ్ నగర్లో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ మహాసభ నిర్వహించారు. అధ్యక్షురాలిగా మలోబిక, కార్యదర్శిగా పృథ్వి తేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ బస్సు కారణంగా విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు.