రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి
TG: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో ఆమె చేరుకోనున్నారు. డిసెంబర్ 19వ తేదీన రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. 22వ తేదీ వరకు HYDలో ముర్ము ఉండనున్నారు.