VIDEO: స్వామివారి సేవలో ఏపీ లోకాయుక్త రజని
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త రజని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఏఈవో రవీంద్ర బాబు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు.