మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్లో తనిఖీలు

KRNL: మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్లో శనివారం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సర్కిల్ ఇన్స్టేషన్ రామాంజులు, మాధవరం ఎస్సై విజయ్ కుమార్ పాల్గొన్నారు.