దివ్యాంగులకు వీల్ఛైర్లు అందజేత
SS: పుట్టపర్తి రూరల్ మండలం బొంతలపల్లి గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగులు అపర్ణ, సునీల్లకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం వీల్ఛైర్లను పంపిణీ చేశారు. ఖిద్మత్-ఎ-ఖల్క్ ఛారిటబుల్ ట్రస్ట్ షామీర్ ఆధ్వర్యంలో ఈ సాయం అందించారు. ట్రస్ట్ సేవలను అభినందించారు. దివ్యాంగులైన అపర్ణ, సునీల్లకు కొంత ఆర్థిక సహాయం కూడా అందించారు.