తమది రైతు సంక్షేమ ప్రభుత్వం: మాజీ మంత్రి

తమది రైతు సంక్షేమ ప్రభుత్వం: మాజీ మంత్రి

సత్యసాయి: CM చంద్రబాబుది రైతు సంక్షేమ ప్రభుత్వమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఓడీ చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును ఆయన ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ధాన్యం బకాయిలను పూర్తిగా చెల్లించామని పేర్కొన్నారు. అనంతరం గ్రామాల పరిశుభ్రత కోసం కేటాయించిన స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు.